30-07-2025 12:07:41 AM
రాజన్న సిరిసిల్ల: జూలై 29 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలోని పసి పిల్లలతో చెలగాటం ఆడుతూ ఇష్టం సారంగా వ్యవహరిస్తు ఒక వైపు గోడల నిర్మాణ పనులు చే స్తుండగా హాస్పిటల్ ఆవరణలో నే సిమెంట్ బాగులు పెట్టి పసి పిల్లలను మరింత ఇన్ఫెక్షన్ వైపు దిగదార్చుతున్నారు.ఎంతటి దూర ప్రాంతాల నుండి వచ్చిన..... ఎంతటి విష జ్వ రం వచ్చినా..... రాత్రివేళ సమయం వరకు వేచి ఉండాల్సిందేనాని తీవ్ర ఆరోపణలు వినబడుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గత కొన్ని సంవత్సరాలుగా వైద్యం అందిస్తున్న ప్రముఖ వైద్యులు సృజన్ పిల్లల హాస్పిటల్ వైద్యులు ప్రసాద్ రావు హాస్పిటల్ తీవ్ర ఆరోపణలు వినబడుతు న్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉంద ని ఒకవైపు హాస్పిటల్ పైకప్పు నిర్మాణ పను లు జరుగుతుండగా పైన గోడల నిర్మాణం కొనసాగిస్తూ మరో వైపు పసి పిల్లలకు వై ద్యం అందిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండి పడుతున్నారు.
హాస్పిటల్ ఆ వరణలో సిమెంట్ బాగులు పెట్టి పిసి పిల్లలను మరింత ఇన్ఫెక్షన్ కు కారకులు అవుతు న్నారని తల్లి దండ్రులు అంటున్నారు.మరోవైపు పసిపిల్లలకు జ్వరం వచ్చింది సార్ మా బిడ్డ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది డాక్టర్ దగ్గరికి పంపండి సారు అని కంపొండర్ లని బ్రతిమిలాడిన ఉదయం కాలం నుండి సాయం కాలమైన ఎలాంటి విష జ్వరం వ చ్చిన మీ సీరియల్ సమయం వచ్చేంత వర కు వేచి ఉండాల్సిందేనని వైద్యానికై వచ్చిన వారి తల్లి దండ్రులు పట్ల కరకాండుగా మా ట్లాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరు పొందిన వైద్యుల దగ్గరనే వైద్యం చేపిస్తారనే మొండి బుద్దితో మాట్లాడుతున్న హా స్పిటల్ పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకువాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధం
హాస్పిటల్లో నిర్మాణ పనులకు జరుగుతుండగా హాస్పిటల్ లోనే సిమెంట్ బాగులు స్లాబ్ నిర్మాణనికి వాడే పెద్ద సపోర్ట్ కట్టెలు హాస్పిటల్ ఆవరణలో నే పెట్టి సిమెంట్ నీళ్ల తో దుర్గంధం చేస్తూ పసి పిల్లలని కాపాడే డాక్టర్ పిల్లలు పట్ల నిర్లక్ష్యం వహిస్తూన్నారని పేర్కొన్నారు.అలాంటి సిమెంట్తో పసిపిల్లల కు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని మం డిపడుతున్నారు.
రేకు డబ్బాలు గాని, ఏదైనా పరికరం చెయ్యి దాటి కింద పడితే పసి పి ల్లల ప్రాణాలు తల్లిదండ్రుల ప్రాణాలు గా ల్లో కలవాల్సిందే అని మండిపడుతున్నారు. హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఏర్పా టు చేయకుండా పసిపిల్లలకైనా తల్లిదండ్రుల కైనా మొత్తానికి ఒకటే బాత్రూం ఏర్పాటు చె య్యగ మూత్రం విసర్జనకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు నెలకొంటున్నారు.
ఆబా త్రూం లోకి ఒకరు వెళ్లారంటే మరో నలుగు రు వేచి ఉండాల్సిందే. ఎలాంటి పార్కింగ్ ఏ ర్పాటు చేయకుండా నడిరోడ్డు పైనే వాహనాలు నిలుపు తు వచ్చి పోయే వాహనదా రులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. హాస్పిటల్లో ఎలాంటి ధరల పట్టిక ఏర్పాటు చేయక ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు.
హాస్పిటల్ పై చర్యలు శూన్యం
గత కొన్ని సంవత్సరాలుగా పసిపిల్లలకు వైద్యం అందిస్తూ పేరు పొందిన డాక్టర్ గా నిలిచిన సృజన్ పిల్లల హాస్పిటల్లో యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నార ని తెలిపారు. హాస్పిటల్ నిబంధన విరుద్ధం గా నడుస్తున్న పసి పిల్లలు ఉదయకాలం నుండి సాయంత్రం వేళ వరకు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. తల్లిదండ్రులు నమ్మ కంతో వస్తూ పసి పిల్లని ఎలాగైనా కాపాడుకోవాలని వస్తే ఉదయం ఒపీ రాపిస్తే సా యంకాలం 6,7 గంటలు గడుస్తున్నా వారిని చూడకపోగా వారి ఓపిక భరిస్తూ పసిపిల్లల ప్రాణాలను కాపాడుకోవాలని వేచి చూస్తే ఎలాగైనా ఇక్కడనే ఉంటారు అనే భావనతో హాస్పిటల్ యాజమాన్యం ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళండి అనే వెక్కిరి మాటలతో అంటూ బెదిరిపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పసి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ పై ఇం తవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద ని అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు పసి పిల్లల ప్రాణాలను దృష్టిలో పె ట్టుకొని ఆ హాస్పిటల్ పై చట్ట పరమైన చర్య లు తీసుకోవాలని పిల్లల తల్లి దండ్రులు కోరుతున్నారు.