22-06-2025 12:40:15 AM
ఆర్క్ రిఫ్లెక్షన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్లో సెమినార్
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్కు చెందిన ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో వింగ్స్ మీడి యా, జీ5 మీడియా హౌస్, గీత అడ్వర్టైజింగ్ సంయుక్తంగా హనమకొండ, వరంగల్లోని హరిత కాకతీయ హోటల్ ప్రాంగణంలో శనివారం సివిల్ సర్వీసెస్ ఎలా క్లియర్ చేయాలి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్క్ రిఫ్లెక్షన్స్ అకాడమీ డైరెక్టర్, యూపీఎస్సీ ర్యాంకర్ (2014) డాక్టర్ జి. వివేకానంద కీలక వక్తగా హాజరై, విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్ష సిద్ధత, లక్ష్య నిర్ధారణ, విజయానికి అవసరమైన మానసిక స్థితిపై విలువైన సూచనలు అం దించారు. సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయాలం టే రోజుకు 15 గంటలు చదవాల్సిన అవస రం లేదని, బదులుగా నిరంతరమైన ప్రాక్టీస్, క్రమశిక్షణ, ఫోకస్ ఉన్న అధ్యయనం అవసరమని చెప్పారు.
అలాగే ఐఐటీలు లేదా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివినవారే యూపీఎస్సీ పరీక్ష లో విజయం సాధిస్తారన్న అపో హను వీడాలని చెప్పారు. ఆర్క్ రిఫ్లెక్షన్స్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ బి. అవినాష్ యూపీఎస్సీ పరీక్షా విధానం గురించి విపులంగా వివరించారు. సెమినార్లో వింగ్స్ మీడియా డైరెక్టర్ గిరి ప్రకాష్, జీ5 మీడియా గ్రూప్ డైరెక్టర్ గణేశ్ పాల్గొన్నారు.