20-05-2025 12:00:00 AM
డీజీపీ డాక్టర్ అనిల్ కుమార్
ఆదిలాబాద్, మే 19 (విజయ క్రాంతి): హెచ్ఆర్ఎంఎస్ను ప్రతి ఒక్క పోలీసు సి బ్బంది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పర్సనల్) డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంకు వచ్చా రు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసు సిబ్బంది గౌరవ వందనాలు సమర్పించి పుష్పగుచ్చం అందజేసి ఆహ్వా నించారు.
అనంతరం జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేశారు. అటు జిల్లాలోని శాంతిభద్రతల సమస్యలను, జిల్లాలో ప్రస్తుతం ఉన్న కేసుల వివరాలు, నూతనంగా అమలు చేస్తున్న విధానాలు, జిల్లా క్రైమ్పై పూర్తి సమాచారాన్ని జిల్లా ఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో ఏఏస్పీ కాజల్ సింగ్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.