calender_icon.png 28 November, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

28-11-2025 09:53:46 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో మాజీ డీసీసీబీ చైర్మన్,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. బైరాపూర్ కు చెందిన జోగు నర్సింలు, పందుల సుధాకర్, గుడికొండ సాయిలు, కొండు పండరి, తుకారాం, కమ్మరి బాబు, దుర్గయ్య, హన్మండ్లు, కొండ్ర రాములు, పోతురాజు రాజు, నిరుడి రాజు, లస్మాపురం దశరథ్ తదితరులు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి కొత్తగా చేరిన నాయకులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.