09-08-2025 01:24:56 AM
మందమర్రి, ఆగస్టు 8: పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కోరారు. మండలంలోని వెంకటాపూర్లో వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటి ఆయన మాట్లాడారు.
అనంతరం గ్రామంలోని వర్మి కంపోస్ట్ షెడ్డు, నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ చేయడాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఓ ఎస్ కిషన్, ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, ఏపీవో రజియా సుల్తానా, ఏపి ఎం చంద్రశేఖర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండ్రు ప్రశాంత్, ఈసి మధు, సిసి చారి, ఫీల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు ఈద లింగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.