10-10-2025 01:38:20 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సాహిత్య రంగం లో ఈ ఏడాది హంగేరియన్ నవలా రచయిత లాస్టో క్రాస్జ్నోహోర్కైకి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. లాస్టో క్రాస్జ్నోహోర్కై విలక్షణమైన, దార్శనిక రచనలకు ఈ అత్యున్నత బహుమతి దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గురువారం అధికారికంగా ప్రకటించింది.ప్రపంచ వినాశనం వంటి తీవ్ర భయానక పరిస్థితుల మధ్య కూడా కళకు ఉన్న అపారమైన శక్తిని తన రచనల ద్వారా బలంగా చాటి చెప్పినందుకు లాస్లోకు ఈ గౌరవం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.
ఆయన సాహిత్యం సమకాలీన ప్రపంచంలోని సంక్లిష్టతలను, మానవ అస్తిత్వ వేదనను వినూత్న శైలిలో ఆవిష్కరిస్తుందని ప్రశంసించింది.లాస్లో క్రాస్నహార్కై తన రచనలతో ఆధునిక సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు నోబెల్ బహుమతితో ఆయన కీర్తి విశ్వవ్యాప్తమైంది. కాగా గతేడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు నోబెల్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే.