05-12-2025 12:57:31 AM
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): భవిష్యత్ క్వాంటం ఎకానమీ లీడ ర్గా హైదరాబాద్ నిలుస్తుందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యం వంటి అన్ని వనరులు హైదరాబాదులో దండిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. గురువారం ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలిలో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం, తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ ఆవిష్కరణ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నీతి ఆయో గ్ రోడ్డు మ్యాప్ ‘తెలంగాణ రైజింగ్ 2047’, 2047 నాటికి తెలంగాణను రూ.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ర్ట దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించినట్టు తెలిపారు. తెలంగాణ క్వాంటం వ్యూ హం ద్వారా క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్ కలిగిన దేశంలోని తొలి రాష్ర్టం గా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు. క్వాంటం టెక్నాలజీ ప్రపంచాన్ని ఏ ఇతర సాంకేతికత కంటే వేగంగా అన్ని రంగాల్లోనూ మార్పు తీసుకురాబోతుందని డి ప్యూటీ సీఎం తెలిపారు.
గొప్ప భవిష్యత్ను కోరుకునే ఏ దేశానికైనా క్వాంటం వ్యూహం(టీక్యూఎస్) అవసరమన్నారు. దేశాల భవిష్యత్, వారి జాతీయ భద్రత, వారి ఆర్థిక పరిమాణం, అభివృద్ధి, అన్నింటినీ ఇది పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుందని తెలిపారు. జాతీయ మిషన్కు అనుసంధానంగా రూ పొందించిన తెలంగాణ క్వాంటం వ్యూహం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఏకీకృత, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తుందని స్పష్టం చేశారు.
టీక్యూఎస్ ప్రారంభంతోపాటు, భారతదేశంలో అత్యంత ఆధునిక క్వాంటం ఇన్నోవే షన్ ఎకోసిస్టమ్ను నిర్మించాలన్న తమ రాష్ర్ట సంకల్పాన్ని ప్రపంచానికి ఈ వేదిక ద్వారా ప్రకటిస్తున్నామన్నారు. క్వాంటం టె క్నాలజీ తెలంగాణతో పాటు భారత ఆర్థిక వృద్ధికి కీలకాధారం కానుందని వివరించారు.
యువ భారత్ స్టార్టప్ ఫండ్ను రూ.1,000 కోట్లతో స్థాపిస్తున్నామని ప్రత్యేకంగా చెప్పాలని, క్వాంటం స్టార్టప్లు తమ ప్రధాన దృష్టి అన్నారు. క్వాంటం కేవలం వ్యాపారం లేదా ఆర్థికాభివృద్ధికే కాదు, కం ప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల పెంపునకు కూడా కీలక మని తెలిపారు.
‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు
‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చే స్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ ట ర్మ్ క్వాంటం స్ట్రాటజీ’ని రూపొందించామన్నారు. అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు.
అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో తెలంగాణను గ్లోబల్ లీడర్గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సెన్సైస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్లున్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామ న్నారు.
క్వాంటం సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్లో ఆర్అండ్డీ, ఇన్నోవేషన్స్ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే ‘డైరెక్షన్’ అని అన్నారు. ఈ టెక్నాలజీలో దేశానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రత్యేకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’కు కూడా శ్రీకారం చుట్టామన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ‘ఫండ్స్ ఆఫ్ ఫం డ్స్’ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ‘ఇండస్ట్రీ డే’ పేరిట ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకం గా సమావేశమవుతారన్నారు.
పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గా లు, రాష్ర్టంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభు త్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహా లు, సూచనలు స్వీకరిస్తారన్నారు. కార్య క్రమంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, మెంబర్ డాక్టర్ వీకే సారస్వత్, దేబ్ జానీ ఘోష్, స్పెషల్ సీఎస్ సంజ య్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.