17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన హైదరాబాద్–శ్రీశైలం హైవే

30-10-2025 11:48 AM

హైదరాబాద్: మోంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో(heavy rains) హైదరాబాద్-శ్రీశైలం హైవేలో(Hyderabad-Srisailam highway ) ఒక భాగం కూలిపోయింది. దీంతో హైదరాబాద్-శ్రీశైలం(Hyderabad-Srisailam) మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో రోడ్డు సగానికి విరిగిపోయి ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. కూలిపోయిన శిథిలాల మీదుగా దూకి దాటడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కనిపించాడు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని లత్తిపూర్ గ్రామంలో ఈ ప్రమాదం సంభవించిందని వార్తలోస్తున్నాయి. కనెక్టివిటీని పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

మొంత తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వర్షాలు ఆగిపోయినప్పటికీ, వరంగల్, హన్మకొండలోని ఎక్కువ భాగం వర్షపు నీటితో మునిగిపోయింది. రహదారులు గురువారం నాలాలుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.