15 June, 2026 | 10:39 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

బ్రిడ్జ్ నిర్మించాలని వాగులో కూర్చొని గ్రామస్తుడి నిరసన

30-10-2025 01:41 PM

మంత్రి జూపల్లి నియోజకవర్గంలో ఘటన

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కొల్లాపూర్ మండలంలోని రాంపురం పశువుల వాగు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఆకునమోని చంద్రయ్య యాదవ్ అనే గ్రామస్థుడు గురువారం వాగు మధ్యలో కూర్చొని ప్రత్యేక నిరసన చేపట్టాడు. వర్షాకాలంలో వాగు పొంగిపొర్లడంతో గ్రామ ప్రజలు వ్యవసాయ పనులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రతి ఏటా వాగు దాటడంలో ప్రమాదాలు ఎదుర్కొంటున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం లోని చాలా ఏళ్లుగా ఈ సమస్య దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన రాకపోవడంతో వాగులో కూర్చోవడం తప్ప మరో మార్గం లేదని నిరసనకారుడు తెలిపారు. గ్రామస్థుల సమస్యను పరిష్కరించి శాశ్వత బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.