01-02-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 31(విజయక్రాంతి): శంషాబాద్ విమానాశ్రయంలో శని వారం భారీగా గంజాయి లభ్యమైంది. బ్యాం కాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగ్లో హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఏడుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించిన అధికారులు రూ.9 కోట్ల 50లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.