24-06-2025 12:34:46 AM
దర్శకుడు మణిరత్నం
తన దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయిందని దర్శకుడు మణిరత్నం పేర్కొన్నారు. ఈ విషయంలో ఆడియన్స్కు క్షమాపణలు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘థగ్ లైఫ్’ ఫలితాలపై స్పందించిన ఆయన, సినిమా విషయంలో ప్రేక్షకులు మరో క్లాసిక్ను ఆశించారని తెలిపారు. ‘మా ఇద్దరి నుంచి మరో ‘నాయకుడు’ లాంటి సినిమాను ఆశించిన వారికి నేను చెపగలిగేది ఒక్కటే.
మమ్నల్ని క్షమించండి. ఆ సినిమా కంటే తక్కువ దాన్ని చేయడం మా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన మాకెప్పుడూ లేదు. అలా ఎలా చేయాలనుకుంటాం. మేం పూర్తిగా భిన్నమైనదాన్ని అందించాలనుకున్నాం. ఎక్కువ అంచనా వేయడంతో మేం అనుకోని ఫలితాన్ని అందుకున్నాం’ అని మణిరత్నం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తన తర్వాత సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.