02-06-2025 12:51:22 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, ( మర్రిగూడ ) జూన్ 1 : మునుగోడు ప్రజల కోసం నాయకుని కాకుండా ప్రజా సేవకుడిగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. నూతన కార్యాలయంలో58వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మునుగోడు ప్రజలు నా పుట్టినరోజు సందర్భంగా సుఖ సంతోషాలతో వెల్లు విరియాలని, సంవత్సరం పొడుగునా మునుగోడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆయన అన్నారు.
మునుగోడు నియోజకవర్గం లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా చూడాలని ఆయన కార్యకర్తలకు, అధికారులకు సూచించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలకు తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందరావు, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, పాశం సురేందర్ రెడ్డి, మాల్ మార్కెట్ వైస్ చైర్మన్ నక్క శ్రీను, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, పలు గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.