02-06-2025 12:50:04 AM
వైరా, జూన 1( విజయక్రాంతి): వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ను వైరా మండల పరిధిలోని కొండకొడెమ గ్రామానికి చెందిన 23 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆదివారం ఘనంగా శాలువాలతో సత్కరించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను సన్మానించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలోవైరా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొర్రా రాజశేఖర్ పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు మాజీ మున్సిపల్ చైర్మన్ జైపాల్ పమ్మి అశోక్ కొండ కోడిమ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్వనేని అశోక్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు వసంత కరుణ అచ్చాలు దారెల్లి అశోక్ నూకల రామారావు దారా జాకోబ్ రామకృష్ణ కష్టాల రజిని గ్రామస్తులు పాల్గొన్నారు.