13 April, 2026 | 12:14 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

ప్రజల కష్టాల్లో నేనుంటా

10-02-2026 12:10 AM
  1. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తా 
  2.  8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడవత్ బాలకోటి 

భూత్పూర్, ఫిబ్రవరి 9 : ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి నిజాయితీగా ప్రజాసేవ చేస్తానని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడవత్ బాలకోటి అన్నారు. సోమవారం పట్టణంలోని 8 వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని నాయకులు కావాలా?. ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులు కావాలా?అన్నది ఓటర్లు ఆలోచించాలని అన్నారు.

నిజాయితీతో సమస్యలను పరిష్కరించాలని తపనతో ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచిన తనను ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడవత్ బాలకోటి అన్నారు. ఆడబిడ్డ పెళ్లిళ్లకు తన సొంత డబ్బులతో రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ మీ ముందుకు వచ్చి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.

ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గుర్తు చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. ఒక అవకాశం ఇస్తే ప్రజల నమ్మకాన్ని జీవితాన్ని అంకితం చేస్తానని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.