27 July, 2026 | 7:54 PM

Breaking News

తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •  

బుట్టాయిగూడెం గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటా..

19-12-2025 12:00 AM

బుట్టాయిగూడెం గ్రామ సర్పంచ్ జాడి రాంబాబు

కన్నాయిగూడెం,డిసెంబర్18(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపించినందుకు బుట్టాయిగూడెం గ్రామ ప్రజల రుణం తీర్చు కుంటానని బుట్టాయిగూడెం గ్రామ సర్పంచు జాడి రాం బాబు అన్నారు.

ఈ సందర్భంగా జాడి రాంబాబు మాట్లాడు తూ బుట్టాయిగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశల కృషి చేస్తానని నాపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో వెనుకంజ వేయనని అన్నారు.

బుట్టాయిగూడెం గ్రామ ప్రజలు నాకు ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని సర్పంచ్ ఒక పదవిగా కాకుండా బాధ్యతగా ఉండి బుట్టాయిగూడెం గ్రామ అభివృద్ధి చేస్తానని తెలిపారు.