03-06-2025 12:35:35 AM
తెలంగాణ తల్లి పాత చిత్రపటానికే పూజలు
నాగర్కర్నూల్, జూన్ 2 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కక్కుర్తి బుద్ది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్స వం వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.
నేపథ్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో తెలంగాణ తల్లి పాత చిత్రపటం స్థానంలో నూ తనంగా రూపొందించిన తెలంగాణ తల్లి చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్ర భుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వ ఆదేశాలను బేకాతర్ చేస్తూ సోమవారం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రచ్చ రఘు మాత్రం తెలంగాణ తల్లి పాత చిత్రపటానికే పూజలు చేశారు.
కేవలం 100 రూపాయల విలువచేసే నూతన చిత్రపటాన్ని ఏర్పాటు చేయలేక తన కక్కుర్తి బుద్ధిని, తన అలసత్వాన్ని మరోసారి ప్రదర్శించడం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోరాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించారు. కానీ తెలంగాణ తల్లి పాత చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలే కాంగుతున్నారు.
పచ్చని పసిడి పంటల తెలంగాణగా రూపుదిద్దుకోవాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన తెలంగాణ చిత్రపటాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కానీ ఈ ఆదేశాలను బేకాతర చేస్తూ స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి తెలంగాణ తల్లి పాత చిత్రపటానికే పూజలు చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జిల్లా లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాత చిత్రపటానీకే పూజలు చేయడం కనిపించింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి.