23-06-2025 12:25:02 AM
తులేకలాన్లో పెద్ద ఎత్తున రైతుల ఆందోళన
ఇబ్రహీంపట్నం, జూన్ 22: రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే రణరంగంగా మారుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం తులేకలాన్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ రైతు లు , బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఊరూరా రైతు ఉ ద్యమానికి శ్రీకారం చుట్టామని, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవరకు పోరాడుతామని చెప్పారు. శివారు ప్రాంతాల్లో రైతు భరోసా నిలిపివేయడంతో రంగారెడ్డి జిల్లాలో 60 వేల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్ కు తగు సమయంలో తగిన గుణపాఠం చెప్పడానికి రైతన్నలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి,ఎంపి పటేల్ గూడ సొసైటీ చైర్మన్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ,
మండల రైతుబంధు అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, మాజీ సర్పంచులు చిలుకల యాదగిరి , కొంగర బీరప్ప , యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు జెర్కోని రాజు, గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు గుజ్జ యాదగిరి, తదితరులుపాల్గొన్నారు.