17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఫీజు బకాయిలు చెల్లించకుంటే ఊరుకోం

09-11-2025 12:46 AM
  1. బీఆర్‌ఎస్ చేసిన తప్పులు కాంగ్రెస్ చేయకూడదని ప్రజలు ఓట్లేసి గెలిపించారు
  2. ప్రైవేట్ కళాశాల యాజమానులను ప్రభుత్వం భయపెట్టి కళాశాలలు తెరిపించింది
  3. సిబ్బందిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం
  4. 15న ఫీజు పోరు పేరిట అఖిలపక్ష సమావేశం
  5. మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్

ముషీరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలి పించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేటు కళాశాలల యజమాన్యాలను ప్రభుత్వం భయపెట్టి కళాశాలలు తెరిపించిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఫీజు పోరు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.

విద్యార్థులకు అన్యాయం చేసిన ఏ పార్టీ అయిన ఒక్కటే అని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ కంటే మెరుగ్గా పాలన అందిస్తారనే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ళ పాలనలో ఎన్ని బకాయిలు ఉన్నాయో, ఈ రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయో లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రేవేట్ కళాశాల యాజమాన్యాలు డోనేషన్ల పేరుతో కోట్లు దోచుకుంటున్నారని సీఎం చేసిన వ్యాఖ్యలు నిజమే కావొచ్చునని, ఆ మాటలకు భయపడే యాజమాన్యాలు కళాశాలలను ఓపెన్ చేశాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

యాజమాన్యాలు బకాయిల పేరుతో విద్యార్థులను, సిబ్బందిని వేధిస్తే తాము చూస్తూ ఉండమని హెచ్చరించారు. ఈనెల 15న ఫీజు పోరు పేరిట విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, పలు యూనివర్సిటీ నేతలు సంజయ్, హరికృష్ణ, సాహిత్, గణేష్, పాపారావు , జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వంశీకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, జగదీష్, రాహుల్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.