25-05-2025 12:00:00 AM
రాత్రిపూట భోజనం తీసుకోవడంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అనేక కారణాలతో ఒక్కో రోజు ఒక్కో టైమ్లో డిన్నర్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. అలాగే ఆలస్యంగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆలస్యంగా భోజనం చేసేవారిలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటుంటారు.
ఇది పేగుల్లోని జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేయడమే కాకుండా.. బరువు పెరగడానికి దారితీస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరానికి మేలు చేసే కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించొచ్చు.
కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను రాత్రివేళ ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే రాత్రివేళ భోజనం ఎనిమిది గంటల లోపు చేయడంతో పాటు షుగర్, ఎక్కువ మసాలాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది.