14-06-2025 07:36:48 PM
సీడు కంపినీలకు, ఆర్గనైజర్లకు అమ్ముడు పోయిన గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు..
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కురువ విజయ్ కుమార్..
గద్వాల (విజయక్రాంతి): గద్వాల జిల్లా సీడు పత్తి రైతుల సమస్యలు రైతు కమీషన్ చైర్మన్ కు వివరించడానికి వస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కురువ విజయ్ కుమార్(BRS Party State Leader Kuruva Vijay Kumar) మండిపడ్డారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడు పత్తి కంపినీలు, ఆర్గనైజర్లు ఒక ముఠాగా ఏర్పడి సీడు పత్తి రైతులు వారు పండించిన పంటను పాస్ అయినప్పటికీ ఫెయిల్ చేస్తూ రైతులను మోసం చేసిన సీడ్ కంపినీలపై, ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని ఈనెల 10వ తేదీన హైద్రాబాద్ లో రైతు కమీషన్ కు పిర్యాదు చేస్తే బిఆర్ఎస్ పార్టీ పిర్యాదుకు స్పందించి శుక్రవారం రైతు కమీషన్ చైర్మన్ కోదండరెడ్డి గరావడం జరిగిందన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు రైతు కమిషన్ వస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు సీడు పత్తి రైతుల సమస్యను పక్కదారి పట్టించే విదంగా కాంగ్రెస్ పార్టీ కార్యాక్రమంలాగా కాంగ్రెస్ పార్టీ జెండాలను,కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ర్యాలీ లాగా చేసి రైతులను మోసం చేసే కుట్ర చేశారన్నారు. సీడు పత్తి రైతులకు అన్యాయం చేసే విదంగా కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయిన జిల్లా కాంగ్రెస్ నాయకులు, సీడు కంపినీలు, సీడు ఆర్గనైజర్లు,అధికారులు కుమ్మక్కయి ఒక ముఠాగా ఏర్పడి సీడు పత్తి రైతులకు జరుగుతున్న మోసాలను రైతులు రైతు కమీషన్ దృష్టికి తీసుకుని వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు నల్లారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు రైతు కమీషన్ చుట్టూ ఉంటు రైతుల పక్షాన రైతులను తీసుకొని మేము అక్కడికి పొతే కొంతమంది రౌడీలు తప్పతాగి వచ్చి రైతులమీదికి ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవనే విదంగా వ్యవహరించారన్నారు.
సమస్య ఉన్న ధరూర్,మల్దకల్,గట్టు ,కేటీ దొడ్డి మండలాల్లో జరగాల్సిన కమీషన్ పర్యటన ను సంబందం లేని పూటాన్ పల్లి గ్రామానికి మార్చారని . ముందస్తు పథకం ప్రకారం కమీషన్ ను పక్కదారి పట్టించేవిదంగా వ్యవహరించారన్నారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ శుక్రవారం రైతు కమీషన్ చైర్మన్ పర్యటించిన పుటాన్ పల్లి గ్రామానికి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర రైతు కమీషన్ కి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అట్టి కమీషన్ క్వాసీ జ్యూడిషియల్ అథారిటీ అయినా అక్కడికి వచ్చి గొడవ చేశాడన్నారు. జిల్లా పోలీసు అధికారులు అధికారపార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తే వారిగా అయ్యారని ఆయన మండిపడ్డారు.
గొడవ చేసిన కాంగ్రెస్ గుండాలను వదిలేసి రైతు సమస్యలు లేవనెత్తిన కమీషన్ ముందు మా వాదనలను వినిపించకుండా బి ఆర్ ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని మమ్మలను రైతులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆలంపూర్ ప్రజలు ఛీ కొట్టినా,బొండకేసి బొక్కబోర్లా పడేసినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ దమ్ము ఉంటె గతంలో నీకు ఓట్లు వేసి ఎమ్మెల్యే గా ఎన్నోకొని నీకు రాజకీయ బిక్ష పెట్టిన రాజోలి మండలంలోని ఏ గ్రామానికి అయినా వెళ్లే దమ్ము ఉందా అని సూటిగా అడుగుతున్నామన్నారు.
త్వరలోనే మీ ల్యాండ్, సాండ్, మైనింగ్ మాఫియా గురించి బయట పెడతామని ఏపని కావాలన్న సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కోసం రాత్రిబవళ్ళు కష్టపడిన కాంగ్రెస్ నాయకులతో కూడా పెర్సన్టేజీలు తీసుకునే వ్యక్తిత్వం మీదని ఆయన విమర్శించారు. తక్షణమే సీడు పత్తి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రైతులతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని, అవసరమైతే రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టును కూడా ఆశ్రయించి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.