14-06-2025 07:34:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, సంస్కతోపన్యాసకులు డా బి. వెంకట్ రాష్ట్ర విశిష్ఠ సేవా కీర్తి పురస్కారమును అందుకున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాదులోని త్యాగరాయ గాన సభ, కళామారుతి వేదికలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2025 ముగింపు సభల్లో సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు వై యస్ శర్మ,ప్రధాన కార్యదర్శి సుప్రియ గుప్త, ప్రముఖ కవులు-చౌడూరి కళాపీఠం అధ్యక్షులు చౌడూరి నరసింహ్మరావు చేతులమీదుగా పురస్కారమును అందుకున్నారు. సాహిత్య సామాజిక సాంస్కృతికకళా ఆధ్యాత్మిక విశిష్ఠ సేవలకు గుర్తింపుగా పురస్కారమును స్వీకరించారు.ఆఫరేషన్ సిందూర్ అనే అంశంపై వచన కవితలను ,పద్యాలను గానం చేశారు. ప్రముఖకవులు- యం.సత్యవీణ, డా వేము వందనం ,మండపాక అరుణకుమారి ,సుజాతారాణి,తదితరులు వెంకట్ ను అభినందించారు.