30-05-2025 11:05:59 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ తూడుకుర్తి గ్రామ ఘటనపై బిఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృధ్వీరాజ్పై అక్రమ కేసు నమోదు చేయడాన్ని బిఎస్పీ నాయకులు ఖండించారు. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బిఎస్పి నేతలు మాట్లాడారు. పృధ్వీరాజ్ మాట్లాడుతూ తనపై నిరాధార కేసు పెట్టారని, హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అలుగు వర్షిణిపై సస్పెన్షన్ డిమాండ్ చేశారు. బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు కళ్యాణ్, ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్, జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్ లు ఉన్నారు