30-05-2025 11:02:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ కోసం ఉద్యమంలో కొట్లాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపునిచ్చి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమ కారులు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం నిర్మల్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారులు నివాళులర్పించి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడిన తమకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పెన్షన్ వంటి సౌకర్యం కల్పించాలని ఇతర డిమాండ్లను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కిరణ్ రెడ్డి కొత్త శేఖర్ పాకాల రామచందర్ తెలంగాణ షరీఫ్ ఇస్మాయిల్ తదితరులున్నారు