14-06-2025 12:32:50 AM
వాజేడు,(విజయక్రాంతి): వాజేడు మండలం ధర్మవరం పట్టా ల్యాండ్ ఇసుక క్వారీలో అక్రమంగా 6 మీటర్ల నుండి 7 మీటర్ల వరకు లోతు ఇసుకనీ తరలిస్తున్న ఇసుక కాంట్రాక్టర్లు పట్టా ల్యాండ్ చట్టం ప్రకారం సుమారు 2 మీటర్ల లోతు వరకు తీయాలని ప్రభుత్వం అనుమతులు ఇస్తే కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగ ఏడు మీటర్ల లోతు వరకు ఇసుకను తీసి తరలిస్తున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారు. దీనివలన గోదావరి ఒడ్డున ఆనుకుని ఉన్నటువంటి పంట పొలాలు వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయే పరిస్థితులు ప్రతి సంవత్సరం సుమారు వందల ఎకరాల్లో ఒడ్డు కొట్టుకుపోయి ఇసుక మేటలో కలిసిపోతున్నా పరిస్థితులు ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారులు తక్షణమే ధర్మారం ఇసుక క్వారీ పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తీసుకొనుట కొరకు అనుమతులు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం డిమాండ్ చేస్తుంది. లేనియెడల దశలవారిగా ఉద్యమాలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, తోట మల్లికార్జున రావు, గగ్గూరి రమణయ్య, బొల్లె ఆదినారాయణ, గౌరారపు సర్వేశ్వర రావు,పానెం సురేష్,అల్లి సూరిబాబు,బొల్లె సూర్యం, బొల్లె శ్రీరాములు, రఘుబాబు,బొల్లె దేవ,గార రాంబాబు, డర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు