06-05-2025 12:00:00 AM
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, మే 5 (విజయక్రాంతి) : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని జిల్లా పరిపాలన అధికారి ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఆఫీసర్ల కన్వర్జేన్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ స్కూలింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ,ఉల్లాస్ మరియు ,సెల్ఫ్ ఉద్యోగులు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆశయం అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ చందర్ , డిఐఈఓ సలాం , డిఆర్డిఓ సురేందర్, డిపిఎం సుధాకర్, శ్రీధర్ రెడ్డి , పిడి ,మెప్మా మొదలగు అధికారులు పాల్గొనడం జరిగింది.