calender_icon.png 6 May, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

06-05-2025 12:00:00 AM

 కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, మే 5 (విజయక్రాంతి) : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని జిల్లా పరిపాలన అధికారి ఆశిష్  సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఆఫీసర్ల కన్వర్జేన్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఓపెన్ స్కూలింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ,ఉల్లాస్ మరియు ,సెల్ఫ్ ఉద్యోగులు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆశయం అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ  చందర్ , డిఐఈఓ  సలాం , డిఆర్డిఓ  సురేందర్, డిపిఎం  సుధాకర్,  శ్రీధర్ రెడ్డి , పిడి ,మెప్మా మొదలగు అధికారులు  పాల్గొనడం జరిగింది.