11-06-2025 01:04:13 AM
ప్రభుత్వానికి సైనిక్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
ఖైరతాబాద్, జూన్ 10(విజయ క్రాంతి): తెలంగాణలో 2025- విద్యాసంవత్సరానికి సైనిక్ స్కూల్ ఏర్పాటుచేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ సైనిక్ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు రామ్ ప్రసాద్, ప్రధానకార్యదర్శి అయిలయ్య, కెప్టెన్ డాక్టర్ కె.కృష్ణారెడ్డి రాష్ర్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
సైనిక్ స్కూల్లో చదివి తమ కలలను సాకారం చేసుకొనేందుకు విద్యార్థులకు సైనిక్ స్కూల్ తాత్కాలిక వసతులతోనైనా వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తిచేశారు. కేవలం ఆరోతరగతిలోనే ప్రవేశాలు జరుగుతాయి కనుక, రాష్ర్ట ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం కూడా మీద ఉండదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులు, సైనిక పాఠశాల అసోసియేషన్, రక్షణ శాఖ అధికారులతో సంప్రదింపులు జరపాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు కొరివి పోచయ్యముదిరాజ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.