27-05-2025 12:00:00 AM
హుజూర్నగర్, మే 26: వేలల్లో ఖర్చు చేసి లక్షలు డ్రా చేసిన గరిడేపల్లి మండలం రాయినిగూడెం పీఏసీఎస్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు సోమవారం సంఘ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రాయినిగూడెం సొసైటీ ఉపవిభాగమైన వెలిదండ సొసైటీలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి రూ.6.62 లక్షలు డ్రా చేశాడని వాస్తవికంగా దాని నిర్మాణానికి కేవలం రూ.75 వేలు మాత్రమే ఖర్చయిందన్నారు. మిగిలిన పాత గోడకి కూడా రంగులు వేసి బిల్లు డ్రా చేశా డని రైతులు ఆరోపించారు.
లాభాలలో ఉన్న సొసైటీ ని నష్టాలలో తీసుక వచ్చిన ఘనత చైర్మన్ కే దక్కుతుందని,అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా చైర్మన్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై గత ఫిబ్రవరి నెలలో చైర్మన్ పై కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించడం జరిగిందని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అతనిపై పూర్తిస్థాయి విచారణ చేసి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. తదుపరి ఇదే విషయమై సంఘ సీ ఈ ఒ,ఆర్ డి ఓ లకు వినతి పత్రం అందజేశారు. కాగా ఈ విషయంపై పి ఏ సీ యస్ సీఈఓ వివరణ అడుగగా సొసైటీ ఉపవిభాగమైన వెలిదండ సొసైటీలో ప్రహరీ గోడ నిర్మాణం అవకతవకల పై ఫిబ్రవరి నెలలో అఖిలపక్ష ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన మాట వాస్తవమేనని చైర్మన్ పై విచారణ పూర్తి చేసి పై అధికారులకు సమర్పించడం జరిగిందన్నారు. తదుపరి ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు..