15 March, 2026 | 11:50 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఆకట్టుకునే ‘కుందనాల బొమ్మ’

10-08-2024 12:05 AM

చేతన్ కష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న  ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ను దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాట సాహిత్యాన్ని రామజోగయ్యశాస్త్రి అందించగా, శ్రీకష్ణ పాడారు. ‘అందమైన కుందనాల బొమ్మరా.. అన్నమయ్య కీర్తనల్లే ఉందిరా.. పద్ధతైన పారిజాత పువ్వురా.. నేనంటే ఇష్టమంటోందిరా..’ అంటూ సాగుతున్న ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.