26 May, 2026 | 12:58 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

అల్లు అర్జున్‌తో తలపడే పాత్రలో..!

08-02-2026 12:55 AM

దక్షిణాది స్టార్స్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఏఏ22’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇందులో మల్టిపుల్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో రష్మిక మందన్న అడుగుపెట్టింది.

ముంబయి షెడ్యూల్‌లో భాగంగా రష్మిక ప్రస్తుతం తన సోలో సీన్ల షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూరి కాగానే అల్లు అర్జున్, జాన్వీ కపూర్, ‘కుబేర’ ఫేమ్ జిమ్ సర్భ్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో రష్మిక పాల్గొననుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి ఫిలింనగర్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక తొలిసారిగా అల్లు అర్జున్ను ఢీకొట్టే శక్తిమంతమైన ప్రతినాయికగా నటిస్తోందని టాక్. ‘పుష్ప’ సిరీస్‌లో జోడీగా అలరించిన బన్నీ ఈ జంట ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా తలపడనున్నారనే వార్త అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.