29-06-2025 12:21:52 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణంతో కుటుంబ జీవనోపాదులను పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఏ పి ఏం రాజు తెలిపినారు శనివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని మండల సమైక్య కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు గౌరు లక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు సంఘాల ద్వారా తీసుకున్న రుణంతో కుటుంబాల జీవనోపాదులను పెంచుకోవాలని తెలపడం జరిగినది.
అలాగే బ్యాంకు, శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను 100శాతం తిరిగి చెల్లించాలని తెలిపారు. సంఘంలోని ప్రతి మహిళ కు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించడం జరిగినది అలాగే ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంఘం ద్వారా రుణాన్ని అందించాలని, వనమాహాత్సవంలో భాగంగా చెట్ల పెంపకం చేపట్టాలని, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం నకు స్త్రీనిధి ఆర్ ఎం కిరణ్ కుమార్, సీ సిలు, గ్రామ సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు.