calender_icon.png 29 June, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి డైరెక్టర్ (పా)ను కలిసిన అఖిలపక్ష నాయకులు, ఓసీ నిర్వాసితులు

29-06-2025 12:24:17 AM

ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందులో పర్యటించిన సింగరేణి సంస్థ డైరెక్టర్ ను జెకె 5 ఓసి విస్తరణ నిర్వాసితులు, అఖిలపక్ష నాయకులు కలిసి వినతిపత్రం శనివారం ఇచ్చారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ జెకె 5 విస్తరణ పేరుతో మొదలుపెట్టుతున్న ఓసి లో తమ ప్రాంతం  ఉందని 135  సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి పుట్టిన ఇల్లందులో ఈ ప్రాంతం నుండే బొగ్గునిక్షేపాలను కనుగొన్నారని ఈరోజు జె కే 5  విస్తరణలో భాగంగా తమ ఇల్లులు, పొలాలను కోల్పోతూ నిర్వాసితులుగా మారుతున్నామని సింగరేణి డైరెక్టర్ కు తెలిపారు.

ఇక్కడ సర్వే చేసిన ఇళ్లకు ఆర్ అండ్ ఆర్  ప్యాకేజీ వర్తింపజేయాలని గతంలో జెకె 5 ఓసి నిర్వహణలో వారికి ఆర్ అండ్ ఆర్ వర్తింప చేశారని అదే విధంగా 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చారని, చెట్టు పుట్టకు కూడా ప్యాకేజీ ఇచ్చారని వారిలాగే ఈ ప్రాజెక్టులో ఉన్న తమకు అందించాలని వారు కోరారు అదేవిధంగా ఎఫెక్ట్ ఏరియాలో ఉన్న ప్రాంతాలను సింగరేణి దత్తత తీసుకోవాలని ముందుగా వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పి పట్టాలు ఇప్పించాలని, అలాగే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పిల్లలు ఉంటున్న క్వార్టర్స్ ను వారికి కేటాయించాలని, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని,  అలాగే సింగరేణి సంస్థ భవిష్యత్తులో జరగబోయే టెండర్లలో వారికి అవకాశం కల్పించాలని, ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎఫెక్ట్ ఏరియాలను మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డైరెక్టర్ ను కోరారు.