8 June, 2026 | 7:36 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

పెరిగిన పారిశ్రామికోత్పత్తి

13-07-2024 12:24 AM

మే నెలలో 5.9 శాతం

న్యూఢిల్లీ, జూలై 12: మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించడంతో దేశంలో పారిశ్రామికోత్పత్తి ఈ ఏడాది మే నెలలో 5.9 శాతం వృద్దిచెందింది. ఫ్యాక్టరీల ఉత్పత్తిని కొలిచే పరిశ్రమల ఉత్పత్తి సూచి (ఐఐపీ) 2023 మే నెలలో 5.7 శాతం పెరగ్గా, ఈ ఏడాది ఆ వృద్ధి 5.9 శాతమని శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది. 2024 మే నెలలో మైనింగ్ ఉత్పత్తి 6.6 శాతం పెరగ్గా, విద్యుదుత్పత్తి 13.7 శాతం వృద్ధిచెందింది. అయితే తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 4.6 శాతానికి పరిమితమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలల్లో ఐఐపీ 5.4 శాతం వృద్ధిచెందింది. నిరుడు ఇదేకాలంలో ఈ వృద్ధి 5.1 శాతం.