క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
15-08-2026 12:15 PM
ముకరంపుర, ఆగస్టు 15(విజయ క్రాంతి): 80వ భారత స్వాతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.






