calender_icon.png 17 June, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ నాయకత్వంలో విశ్వగురువుగా భారత్

16-06-2025 12:00:00 AM

మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి 

కొండాపూర్, జూన్ 15 :  కొండాపూర్ మండల పరిధిలో గల తొగర్పల్లి గ్రామంలో బీజేపి మండల ప్రధాన కార్యదర్శి శివ కుమార్ సమక్షంలో 11 సంవత్సరాల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం అభివృద్ది పథంలో సాగుతుందని తెలిపారు. 81 కోట్లకు పైగా లబ్ధిదారులకు గరీబ్ కళ్యాణ యోజన ద్వారా ఉచిత రేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు 6000 రూపాయలు వార్షిక సహాయం, 2014-25 లో 54917 కిలో మీటర్ల రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత మోదీకే చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, సూర్య నాయక్, నాయకులు ప్రవీణ్, బాలు, అనంత స్వామి, కిషన్ యాదవ్, నితీష్, శివ, భాను, గోపాల్, అనిల్, అభినయ్, మల్లికార్జున్, మహేశ్, గోపాల్, శ్రీకాంత్, విశ్వనాథ్ పాల్గొన్నారు.