16-06-2025 12:00:00 AM
కామారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా దోమకొండ మండల రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా 16న సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకి దోమకొండ రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2025 వానకాలం సీజన్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం , దోమకొండ రైతు వేదికలో కేటాయించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం కలదు అని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. కావున రైతులందరూ తప్పని సరిగా హాజరు కావాలని కోరారు.
47 రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు
కామారెడ్డి, జూన్ 15,(విజయక్రాంతి) కామారెడ్డి జిల్లాలోని 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 25 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులో ఉందని, తాజాగా మంజూరైన వాటితో మొత్తం 72 రైతు వేదికల్లో అందుబాటులోకి వచ్చిందన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభిస్తారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.