1 July, 2026 | 7:09 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

అండర్ ఆసియా కప్ ఫైనల్లో భారత్

21-12-2024 12:45 AM

సూపర్4లో లంకపై విజయం

సింగపూర్: అండర్ మహిళల టీ20 ఆసియా కప్‌లో యువ భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా నాలుగు వికెట్ల తేడాతో విజయా న్ని సాధించింది. తొలుత బ్యాటింగ్  చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. మానుడి ననయాకర (33) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 4 వికెట్లతో రాణించగా.. పరునికా 2 వికెట్లు తీసింది. అనంతరం భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. తెలంగాణ బ్యాటర్ గొంగిడి త్రిష (32), కమలిని (28), మిథిలా వినోద్ (17 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. లంక బౌలర్లలో చమోదీ ప్రబోద 3 వికెట్లు పడగొట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.