భారత్ మహిళలకు సెమీస్ ఆశలు ముగింపు.. ఆసీస్ చేతిలో ఘోర పరాజయం
ఆసీస్ చేతిలో పరాజయం
టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్
మ్యాచ్ హైలైట్స్
- భారత్: 171/6 (20 ఓవర్లు)
- హర్మన్ప్రీత్ కౌర్: 56 పరుగులు
- స్మృతి మంధాన: 38 పరుగులు
- షఫాలీ వర్మ: 34 పరుగులు
- ఆస్ట్రేలియా: 172/4 (19 ఓవర్లు)
- ఎలిస్ పెర్రీ: 56 పరుగులు
- ఆష్లే గార్డ్నర్: 53* పరుగులు
లార్డ్స్, జూన్ 28: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-లో భారత కథ ముగిసింది. ఆస్ట్రేలియాతో ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. లా ర్డ్స్ వేదకిగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ(56)తో అదరగొట్టగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు. జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసింది. అయితే, ఆఖరి ఓవర్లో ఆమె రిటైర్డ్ అవుట్గా వెనుదిరగగా.. రిచా ఘోష్ ఆమె స్థానంలో వచ్చింది. అయితే, రిచా ఒక్క పరుగే చేయగా.. దీప్తి శర్మ నాలుగు పరుగలతో అజేయంగా నిలిచింది.
భారత్ మహిళల జట్టు ఎందుకు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది?
- ఆస్ట్రేలియాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి
- భారత్ 171 పరుగులు చేసినా సరిపోలేదు
- ఎలిస్ పెర్రీ (56), ఆష్లే గార్డ్నర్ (53*) మ్యాచ్ను మలుపుతిప్పారు
- గ్రూప్-ఏ నుంచి దక్షిణాఫ్రికా సెమీస్కు అర్హత సాధించింది
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ మహిళల జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. హర్మన్ప్రీత్ కౌర్ అర్ధసెంచరీ చేసినప్పటికీ, ఎలిస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్ అద్భుత బ్యాటింగ్తో ఆస్ట్రేలియా సెమీస్కు చేరుకుంది.
ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ సోఫీ మోలినెక్స్ రెండు వికెట్లు దక్కించుకుంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు ఆదిలోనే రేణుకా సింగ్ షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (4)ను స్వల్ప స్కోరుకే వెనక్కి పంపింది. అయితే, బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్ (22) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. అయితే, ఎలిస్ పెర్రి (56), ఆష్లే గార్డ్నర్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టార. దీంతో 19 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జ యభేరి మోగించింది. గ్రూప్ -ఎ నుంచి సౌతాఫ్రికా సెమీస్లో అడుగుపెట్టింది.
హర్మన్ప్రీత్ పోరాటం వృథా.. కోట్లాది అభిమానుల సెమీస్ కలలు చిద్రమయ్యాయి! లార్డ్స్లో మరోసారి ఆసీస్ ఆధిపత్యం.
దేశవ్యాప్తంగా తాజా రాజకీయ, జాతీయ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్ హోమ్పేజ్ను సందర్శించండి.
భారత్ మహిళల జట్టు ఎందుకు సెమీస్కు చేరలేదు?
ఆస్ట్రేలియాతో జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగారు ఎవరు?
కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు.
ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు ఎవరు?
ఎలిస్ పెర్రీ (56), ఆష్లే గార్డ్నర్ (53*) మ్యాచ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.
సెమీస్కు ఏ జట్టు అర్హత సాధించింది?
గ్రూప్-ఏ నుంచి దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్కు చేరుకుంది.
FAQ's
1. భారత్ మహిళల జట్టు ఎంత స్కోర్ చేసింది?
భారత్ 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.
2. హర్మన్ప్రీత్ కౌర్ ఎన్ని పరుగులు చేసింది?
హర్మన్ప్రీత్ 56 పరుగులతో అర్ధశతకం నమోదు చేసింది.
3. ఆస్ట్రేలియా ఎంత ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది?
ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 172 పరుగులు చేసి విజయం సాధించింది.
4. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించిందా?
అవును. ఈ ఓటమితో భారత్ మహిళల జట్టు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
5. సెమీఫైనల్కు ఏ జట్టు అర్హత సాధించింది?
దక్షిణాఫ్రికా జట్టు సెమీస్కు చేరుకుంది.






