30 March, 2026 | 12:09 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

భారత్ కు షాక్.. విరాట్ కోహ్లీ ఔట్.. 81/4

06-12-2024 11:38 AM

టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆడిలైట్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్ జరుగుతున్న మ్యాచులో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. స్పల్ప వ్యవధిలో భారత్ కు మిచెల్ షాక్ ఇచ్చాడు. గత టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీని(7) పరుగులకే ఔట్ చేశాడు. స్టార్క్ వేసిన బంతిని ఆడే క్రమంలో స్లిప్ లో ఉన్న స్మిత్ కు విరాట్ కోహ్లీ క్యాచ్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. మూడు ఓవర్ల వ్యవధిలో టీమిండియా మూడు వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ (31) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. ఇప్పటి వరకు  జరిగిన ఆటలో భారత్ 22.1 ఓవర్లలో నాలులు కీలక వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(01), రిషబ్ పంత్(4) పరుగులతో ఆడుతున్నారు. మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శన చూపిన జైస్వాల్, విరాట్ కోహ్లీ ఈ మ్యాచులో భారత్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచారు.