18-06-2025 12:44:04 AM
న్యూఢిల్లీ, జూన్ 17: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియను భారత్ ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో కూడిన తొలి బృందం ఇరాన్ నుంచి ఆర్మేనియాకు క్షేమంగా చేరుకుంది. వీరంతా నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఇరాన్లో వివిధ విశ్వవిద్యాల యాల్లో భారత్కు చెందిన 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. టెహ్రాన్ను వీడాలని ట్రంప్ చేసిన హెచ్చరికలతో ఇరాన్లోని భార త రాయబార కార్యాలయం మరింత అప్రమత్తమైం ది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొ న్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొంది.
సొంత రవాణా సదుపాయం ఉన్నవారు తక్షణమే టె హ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. అం తేకాదు ఇరాన్లో చిక్కుకున్న విద్యార్థులను వీలైనంత త్వరగా తరలిచేందుకు ఏర్పాట్లు చేసిం ది. అందుకు ప్రత్యేక హెల్ప్లైన్ నంబ ర్లు ఏర్పాటు చేశారు.