18-06-2025 12:42:16 AM
- మే నెలలో 0.39 శాతానికి తగ్గుదల
- భారీగా తగ్గనున్న నిత్యావసర సరుకులు
న్యూఢిల్లీ, జూన్ 17: ఆహారం, కూరగాయలు, ఇంధన ధరల తగ్గుదలతో టోకు ద్రవ్యోల్పణం 14 నెలల కనిష్ఠానికి దిగివచ్చింది. 2025 మే నెలకు గానూ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్పణం 0.39 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు టోకు ద్రోవ్యోల్పణం 0.85 శాతంగా ఉంటే గతేడాది మే నెలలో ఇది 2.74 శాతంగా ఉంది.
ఆహార వస్తువుల విభాగంలో 1.56 శాతం ప్రతికూల ద్రవ్యోల్పణం నమోదైంది. ఏప్రిల్ నెలలో మైనస్ 0.86 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు భారీగా దిగిరానున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశీయ ద్రవ్యోల్పణం 2025 ఆర్థిక సంవత్సరానికి 4 శాతానికి దిగివస్తుందని తెలిపింది. ఈ క్రమంలోనే కీలక పాలసీ వడ్డీ రేట్లను తగ్గించింది. టోకు ద్రోవ్యోల్పణం తగ్గుముఖం పట్టడం అన్ని విభాగాల్లోనూ కనిపించిందని ఇక్రా సీనియర్ ఆర్థిక వేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు.