17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇండిగో సంక్షోభం.. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

07-12-2025 10:12 AM

న్యూఢిల్లీ: ఇండిగో విమానాల అంతరాయాలు వరుసగా ఆరో రోజుకు చేరుకున్నాయి. పెరుగుతున్న ప్రయాణీకుల ఫిర్యాదులను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. స్పైస్ జెట్ విమాన సంస్థ వంద అదనపు విమానాలు, అలాగే. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న రైల్వే, ఆర్టీసీ నడుపుతున్నట్లు సమాచారం.

ముంబాయి, ఢిల్లీ, పుణె, హావ్ డా, హైదరాబాద్ కు వంద కంటే ఎక్కువ ట్రిప్పులతో 89 ప్రత్యేక రైలు సర్వీసులు కొనసాగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వివిధ రైల్వే జోన్ల మీదుగ 3 రోజులపాటు ప్రత్యేక రైలు సర్వీసులు, 37 రైళ్లకు అదనపు కోచ్ లు జోడించి నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. శంషాబాద్ నుంచి పలు ప్రాంతాలకు జీఎంఆర్ సంస్థ ఆర్టీసీ పత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నంతో పాటు ప్రత్యేక బస్సు సర్వీసులు కొనసాగనున్నాయి.

ఇండిగోపై పూర్తి చర్య తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంపెనీకి, సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసు పంపింది.  24 గంటల్లోగా స్పందించాలని కోరింది. బహుళ విమానాశ్రయాలలో గందరగోళం నెలకొనడంతో శనివారం దాదాపు 400 విమానాలను ఎయిర్‌లైన్ రద్దు చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని వ్యక్తులు ఆయన ఉద్యోగం ప్రమాదంలో ఉందని బహిరంగంగా చెబుతున్నారు. భారతదేశం అంతటా విమానాశ్రయాలలో రోజుల తరబడి గందరగోళం నెలకొన్న తర్వాత, పై నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ గందరగోళాన్ని శాశ్వతంగా పరిష్కరించాలనుకుంటోందని అధికారులు వివరించారు.