17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

07-12-2025 09:48 AM

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,007 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,154 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో రూ.3.13 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనమవుతోందని, సర్వదర్శనానికి టికెట్లు ఉన్న భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.