calender_icon.png 19 July, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి

18-07-2025 11:32:26 PM

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

చిట్యాల,(విజయక్రాంతి): మహిళలు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదాన ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ఫ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధ్యక్షతన జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళల ఆర్థికా భివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

మహిళలు సరికొత్త ఆలోచనలతో నూతన వ్యాపారాలు చేపట్టి  అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళలు తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని ఆ ఆలోచనలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు పొదుపు సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని, ప్రతి  మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండాలని తెలిపారు. ఇందిరమ్మ మహిళా సంఘంలో సభ్యులుగా వుండడం వల్ల వడ్డీ లేకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం రాష్ట్ర రాజధాని శిల్పా రామంలో 300 కోట్లతో నిర్మించిన స్టాల్ లో  మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట గృహాన్ని నిర్మించుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న మహిళ మహిళ మరణిస్తే  2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా  సంఘంలో సభ్యులుగా చేర్పిస్తున్నామని,అలాగే తల్లిదండ్రులు లేని 16 సంవత్సరాలు నిండిన యువతులను మహిళ సంఘంలో చేర్చుతున్నామని తెలిపారు. అమ్మ చేతి వంటకు కేరాఫ్ అడ్రస్ ఇందిర మహిళా శక్తి అని, అందుకే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. గోదాంలు, మిల్లులు, పెట్రోల్ బంకులు, కోళ్ల ఫామ్ లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సోలార్ విద్యుత్తు, ఆర్టీసీ బస్సులు ఇలా అనేక  రకాల వ్యాపార సదుపాయాలు మహిళా సంఘాలకు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, క్రమశిక్షణతో చెల్లింపులు తిరిగి చేశారని అలాంటి సంఘాల కు వడ్డీ మాఫీ చేసి తిరిగి చెల్లిస్తున్నామని తెలిపారు.పేదరిక నిర్మూలన జరగాలని, మహిళలు సంతోషంగా ఉండాలని, మహిళ సంతోషంగా ఉంటేనే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ... నియోజకవర్గంలో 6 బస్సులు ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా మంజూరు చేసామని ప్రతి నెలా ఒక్కో బస్సుకు 70 వేల రూపాయలు ఆర్టీసీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటుతో పాఠశాలల్లో సౌకర్యాలు కల్పన పనులు, విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టు మిషన్ పనులు, 6 ఇందిరా మహిళా శక్తి క్యాన్టీలు, మొబైల్ చేపల విక్రయ వాహనం, చెల్పూర్ లో మిల్లెట్ యూనిట్ వంటి మహిళా సాధికారతకు చేపట్టినట్లు పేర్కొన్నారు.