18-06-2025 12:00:00 AM
కామారెడ్డి, జూన్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఆసుపత్రిలో మంగళవారం ఆస్పత్రి సూపర్డెంట్ ఫరీదా ఆధ్వర్యంలో ఆరోగ్యమిత్రలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి జిల్లా మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ సేవ ద్వారా ప్రజలకు అందుతున్న ఆరోగ్య మిత్రుల ద్వారా ఆరా తీశారు.
అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు నిరంతరం సేవలు అందించే విధంగా ఆరోగ్య మిత్రులకు దిశ నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం జిజిహెచ్ హాస్పిటల్ సూపర్డెంట్, ఆరోగ్య మిత్రలతో ఆరోగ్యశ్రీ సేవలు అందించే సమస్యల పైన చర్చించారు.
అనంతరం రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. ఈ సమావేశంలో జి జి హెచ్ హాస్పిటల్స్ సూపర్డెంట్ ఫరీదా బేగం, ఉమ్మడి జిల్లాల టీంలీడర్లు అల్లావుద్దీన్, యశ్వంత్, జిల్లాల వారీగా ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు.