calender_icon.png 16 June, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

15-06-2025 09:02:23 PM

రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్..

మందమర్రి (విజయక్రాంతి): నియోజకవర్గంలో అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిర మైండ్లు మంజూరు చేసి నిరుపేదల సొంతింటి కళను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) అన్నారు. మండలంలోని సారంగపెల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం  సండ్రోన్ పల్లిలోని కేఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. 100 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడే తప్ప నిరుపేదలు గుర్తుకు రాలేదని, ఏ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు.

తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. రాష్ట్రం లోని ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందని దీనిలో భాగంగానే అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 600 చరదపు గజాల్లో ఇల్లు కట్టుకుంటేనే ఇందిరమ్మ ఇంటి అర్హత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు,  కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మంత్రికి  ఘన సన్మానం

 పతనానికి వచ్చిన కార్మిక మంత్రి వెంకటస్వామిని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. పట్టణంలోని బి వన్ క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వికలాంగులకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోగా త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఇందూరి రమేష్ దురిశెట్టి లక్ష్మణ్, షేక్ రావు రాం శ్రీనివాస్, బానోతు సుశీల లు పాల్గొన్నారు.