18-06-2025 12:59:34 AM
జడ్చర్ల జూన్ 17: ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పండుగ వాతావరణం కనిపిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారంఊర్కొండ మండల కేంద్రంలోనీ రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ లను పంపిణీ చేసిన అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, కొండెడ్ గ్రామంలో నూతనంగా వేసిన రూ 35 లక్షల తో వేయనున్న సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తో పాటు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు.
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని, నేడు ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరుగుతుండడం సంబురంగా ఉందన్నారు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ప్రజలకు సావిధానంగా వివరించి అర్థమయ్యేలా చెప్పి పనులు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు సాగుతుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.