18-06-2025 01:00:51 AM
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర, జూన్ 17 : ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని నమ్మకం నిలబెట్టుకుంటున్నామని మాయ మాటలు చెప్పడం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తకోట పట్టణంలోని దండు గడ్డ కాలనీ లోని అంగన్వాడి బిల్డింగ్ వద్ద రాష్ర్ట ప్రభుత్వం చిన్నారులకు న్యూట్రిషన్ కార్యక్రమాన్ని నూతనంగా నిర్మించిన గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ ప్రారంభోత్సవంలో, గర్ల్స్ హైస్కూల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజను ఎమ్మెల్యే జి మధు రెడ్డి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు మంచి పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. గర్భిణి, బాలింతలకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తున్నామని తెలియజేశారు. అందరికీ మంచి చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేశారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ మెయిల్ చేస్తున్నామని సూచించారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.