17-06-2025 12:00:00 AM
- రాబోయే మూడున్నర సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తాం
- నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, లబ్ధిదారుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రివర్యులు పొంగులేటి, పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, జూన్ 16 (విజయ క్రాంతి):పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, స మాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
సోమవారం మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి నేలకొండపల్లి మండలం లో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడు తూ గువ్వలగూడెం గ్రామంలో అంతర్గత రో డ్ల నిర్మాణ పనులకు 75 లక్షల రూపాయ లు, లింక్ రోడ్డు నిర్మాణ పనులకు 13.5 కోట్ల రూపాయలు, మొత్తం దాదాపు 14 కోట్ల 25 లక్షలు రూపాయలను వివిధ రూ పాల్లో ప్రభుత్వం మంజూరు చేసిందని అ న్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం పేదవాడి కన్నీరు తుడిచే వి ధంగా, పేదవాడికి అండగా, పేదవాడికి సహా యం చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకొని రావడం జరి గిందని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖ మ్మం కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న త ర్వాత మొదటి కార్యక్రమానికి హాజరు కా వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, డివి జనల్ పంచాయతీ అధికారి రాంబాబు, పం చాయతీరాజ్, ఆర్అండ్బి., విద్యుత్, సంబంధితశాఖలఅధికారులు, పాల్గొన్నారు.