02-05-2025 12:00:00 AM
అధికారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశం
ఆదిలాబాద్, మే 1 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులకు ఆదేశించారు.ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం వార్డ్ ఆఫీసర్లతో ఇం దిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, లబ్ధిదారుల ఎంపిక, తదితరంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్ల అం దేవిధంగా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉం దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపిక జాబితా లో అనర్హులు ఉంటే వారిని తొలగించి అర్హులను చేర్చాలని అధికారులను ఆదేశించారు.