25-06-2025 01:32:38 AM
ఘట్ కేసర్, జూన్ 24 : అర్హులకు అందాల్సిన ఇందిరమ్మ ఇండ్లు అనర్హులు, కాంగ్రెస్ కార్యకర్తలకేకెటాయింపులు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ ఘట్ కేసర్ మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు కాకుండా కాంగ్రెస్ పెద్దలు వారి కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లను కెటాయించడం జరుగుతుందని ఆరోపించారు.
ఇకనైనా కాంగ్రెస్ నాయకులు, అధికారులు అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన వారిని ఎంపిక చేసి వారికే ఇందిరమ్మ ఇండ్లు అందేవిధంగా చూడాలని, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించాలని మహిపాల్ రెడ్డి సూచించారు.